‘ఆ ఘనత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌దే’ 

Published on Sat, 01/11/2020 - 17:46

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఉన్న నాలుగు చెక్కర ఫ్యాక్టరీల అభివృద్ధికి రూ. 100 కోట్ల గ్రాంటు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొనియాడారు. సీఎం జగన్‌ మరో ఎన్నికల హామిని నెరవేర్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు రూ. 200 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో గోవాడ చెక్కెర ఫ్యాక్టరీ రూ.150 కోట్ల నష్టాల ఊబిలో ఉందని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 40.25కోట్లు మంజూరైందని, రెండు రోజుల్లో గోవాడ చెక్కర కర్మాగారం రైతులు, కార్మికులకు రూ. 18.28 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రూ. 22 కోట్లతో డిస్టలరీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 47 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వడం వల్ల రైతులకు, కార్మికులకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

సీఎం జగన్‌ రైతు పక్షపాతి : బీశెట్టి సత్యవతి 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీలు మూలన పడ్డాయని ఆరోపించారు. సీఎం జగన్‌ రైతు బాంధవుడని కొనియాడారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ