బంగారం దిగుమతులు పెరిగే చాన్స్‌!

Published on Tue, 11/28/2017 - 01:04

న్యూఢిల్లీ: భారత్‌ పసిడి దిగుమతులు– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) పెరిగే అవకాశం ఉందని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) అంచనావేసింది. ఈ పరిమాణాన్ని 700 టన్నులుగా మండలి పేర్కొంది. 2016–17లో ఈ పరిమాణం 500 టన్నులు. ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మండలి చైర్మన్‌ ప్రవీణ్‌ శంకర్‌ పాండ్య మాట్లాడుతూ, 2017–18 వార్షిక బడ్జెట్‌లో దిగుమతుల సుంకాన్ని 4 నుంచి 5 శాతం శ్రేణికి తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

 ప్రస్తుతం ఉన్న 10 శాతం వల్ల బంగారం అక్రమ రవాణా సమస్య ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ వృద్ధికి కూడా ఈ స్థాయి దిగుమతి సుంకం సరికాదని అన్నారు. కాగా ఇదే సమావేశంలో మాట్లాడిన మండలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సవ్యసాచి రాయ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం దిగుమతులు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పసిడి విధానాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ