ఎగుమతుల జోరు

Published on Thu, 03/16/2017 - 01:22

ఫిబ్రవరిలో 17 శాతం వృద్ధి
24.5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు


న్యూఢిల్లీ: ఎగుమతులు ఫిబ్రవరిలో పరుగులు తీశాయి. గత ఆరు నెలల కాలంలో అత్యధిక స్థాయిలో 17.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 24.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రసాయనాల ఎగుమతులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో దిగుమతులు సైతం పెరగడంతో దేశ వాణిజ్య లోటు 8.89 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది. గతేడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 6.57 బిలియన్‌ డాలర్లుగానే ఉంది.

గతేడాది సెప్టెంబర్‌ తర్వాత మొదటి సారి ఎగుమతుల్లో రెండంకెల సానుకూల వృద్ధి నమోదైందని వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక దిగుమతులు ఫిబ్రవరిలో 21.76% అధికంగా 33.38 డాలర్ల మేర జరిగాయి. 2016 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎగుమతుల్లో వృద్ధి 2.52%గా ఉందని, 245బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. దిగుమతులు 3.67% తగ్గి 340.7 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయ్యాయి. 11 నెలల కాలంలో వాణిజ్య లోటు 95.28 డాలర్లుగా ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ