స్టాక్‌మార్కెట్లకు సెలవు

Published on Sat, 09/30/2017 - 13:41


సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి.  ఈక్విటీ మార్కెట్లకు శని, ఆదివారాలు సెలవు దినాలు.  అలాగే అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం  సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు.  దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలో   ట్రేడింగ్‌ ఉండదు.  తిరిగి మంగళవారం(3న) యథాప్రకారం ఉదయం 9.15కు మార్కెట్లు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్‌ ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌ భారీగా నష్టపోగా , ముగింపు సందర్భంగా  గురువారం చివర్లో మార్కెట్లు కోలుకున్నాయి.  అయితే అక్టోబర్‌ సిరీస్‌ ప్రారంభం రోజు (శుక్రవారం)న మార్కెట్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి.

ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో గురువారం స్టాక్‌ మార్కెట్లలో ఏకంగా రూ. 15 లక్షల కోట్ల టర్నోవర్‌ నమోదుకాగా,  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గురువారం నగదు విభాగంలో రూ. 5,328 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.   అలాగే  దేశీ ఫండ్స్ (డీఐఐలు) గురువారం ఏకంగా రూ. 5,196 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

 సాక్షి  వెబ్‌  పాఠకులకు  విజయదశమి శుభాకాంక్షలు! 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ