వృద్ధి రేటును తగ్గించిన మరో సంస్థ

Published on Thu, 11/28/2019 - 17:45

సాక్షి, న్యూఢిల్లీ:  భారత ఆర్థిక వ్యవస్థపై రాయటర్స్‌ పోల్‌ అధ్యయనం చేసింది. ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో పలు కీలక అంశాలను వెల్లడించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా వృద్ధిరేటు తగ్గుదల కనిపించబోతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ సంవత్సరంలో (2019-2020) 4.7శాతం వృద్ధి రేటు నమోదవుతుందని తెలిపింది. వినియాగదారుల డిమాండ్‌, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తగ్గడం, ప్రపంచ మందగమనం వల్ల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక తెలిపింది.

ఆర్‌బీఐ రెపోరేట్లను మరోసారి 25 బీపీఎస్‌ పాయింట్ల ద్వారా 4.90శాతం తగ్గిస్తుందని అంచనా వేసింది.  అయితే ఇప్పటి వరకు ఆర్‌బీఐ రెపోరేటును ఆరోసారి తగ్గించడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో రేటు అన్న విషయం తెలిసిందే. వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంటుందని, మారిన కేంద్ర బ్యాంక్‌ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు రేటింగ్‌ సంస్థలు భారత వృద్ధిరేటును తగ్గించడం వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ