ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం

Published on Fri, 04/21/2017 - 14:23

బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో సాప్ట్ వేర్ సంస్థల ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారి ఆందోళనకు చెక్ పెడుతూ మరికొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల నియామకంపైన కూడా దృష్టిపెడుతున్నాయి. బహుళ జాతీయ సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ సంస్థలో ఒకటైన ఎస్ఏపీ భారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ దాదాపు 2500 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. బెంగళూరు క్యాంపస్లో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ ఇంజనీర్ల రిక్రూట్ మెంట్ను కంపెనీ చేపట్టబోతుందని పేర్కొన్నాయి.
 
50 మిలియన్ యూరోల పెట్టుబడులతో 5.15 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త సౌకర్యాన్ని కంపెనీ ప్రారంభించింది. గత రెండేళ్లుగా కూడా కంపెనీ మంచి ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది. ప్రతేడాది 1500 మంది ఇంజనీర్లను ఇప్పటికే ఈ కంపెనీ నియమించుకుంది. గత రెండేళ్లుగా తమ నియామకాలు కాలేజీ క్యాంపస్ల ద్వారానే జరిపామని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండెల్వాల్ చెప్పారు. ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియాలో 10వేలకు పైగా ఉద్యోగులున్నారని, వారిలో 7500 మంది ఇంజనీరింగ్ డివిజన్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీకి మొత్తం 85000 మంది ఉద్యోగులున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ