దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

Published on Sun, 04/05/2020 - 19:27

నోయిడా : ఒకవైపు  ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతున్న వేళ  ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన జీతూ(19) అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి  నోయిడాలోని సాలాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అతని మేనమామ కూడా సాలాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. మేనమామ కూతురిపై కన్నేసిన జీతూ.. శనివారం బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం బాలిక మృతి చెందింది. యువకుడిపై అత్యాచార, హత్య కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని పోలీసులు పేర్కొన్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ