ట్రైన్‌తో సెల్ఫీ.. గాల్లోకి ఎగిరిపడ్డారు..

Published on Tue, 10/03/2017 - 16:16

బెంగళూరు : వెర్రి ఆలోచనలతో విద్యార్థులు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) వారి పాలిట మరణ మృదంగాలుగా మారుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒకచోట సెల్ఫీ మరణాలు సంభవిస్తున్నా అవగాహనకు తెచ్చుకోకుండా అలాంటి ప్రమాదాలనే మళ్ల మళ్లీ కొని తెచ్చుకుంటున్నారు. బెంగళూరులో మొన్న ఓ చెరువులో స్నానం చేస్తూ సెల్ఫీలు దిగే క్రమంలో ఓ విద్యార్థి చనిపోగా నేడు కూడా అదే బెంగళూరులో రైలుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు.

వేగంగా వచ్చిన రైలు వారిని అమాంతం ఢీకొట్టడంతో ముగ్గురి శరీరాలు చిద్రమయ్యాయి. గాల్లో బంతుల్లాగా ఎగిరి పట్టాలపై ముక్కలుగా పడ్డారు. ఈ ఘటన గురించి పరిశీలించిన అధికారులు కచ్చితంగా సెల్ఫీ ప్రయత్నంలోనే దుర్ఘటన చోటు చేసుకుందని, రైలు తమకు ఎంత సమీపంలో ఉందనే విషయాన్ని అంచనా వేయలేకపోయారని అంటున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి 10గంటల మధ్య బెంగళూరుకు 30 కిలోమీటర్లలోని బిడది అనే గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని ప్రభు ఆనంద్‌(18), రోహిత్‌(16), ప్రతేఖ్‌ రాయకర్‌(20) అనే విద్యార్థులుగా గుర్తించారు. వీరు జయనగర్‌లోని నేషనల్‌ కాలేజీలో చదువుకుంటున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ