ఏటీఎం కార్డు కాజేసి నగదు అపహరణ

Published on Sat, 09/08/2018 - 12:59

విజయనగరం, గజపతినగరం: ఏటీఎం కార్డు కాజేసి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని పాతరోడ్డులో నివాసముంటున్న శంకరరావు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతని కుమార్తె మౌలి పాత నోట్ల మార్పిడి సమయంలో కొంత సొమ్ము తన ఖాతాలో జమ చేసింది.  అప్పటి నుంచి బ్యాంక్‌ ఖాతాను నిర్వహించకుండా వదిలేసింది. ఇటీవల ఏటీఎం కార్డుకు దరఖాస్తు చేయడంతో కార్డు వచ్చింది. దీంతో కార్డును ఇన్‌స్టాల్‌ చేయడానికి నెల రోజుల కిందట పట్టణంలోని ఏటీఎంకు వెళ్లింది. ఇన్‌స్టాల్‌ చేసే విషయమై అవగాహన లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ యువకుడికి కార్డు ఇచ్చి ఇన్‌స్టాల్‌ చేయమని కోరగా, అతడు ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్లు నటిస్తూ తన దగ్గరున్న మరో కార్డును ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది గమనించిన బాధితురాలు ఏటీఎం కార్డును ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఆ మరుచటి రోజు బొండపల్లి ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ. 40 వేలు అగంతకుడు డ్రా చేశాడు. అలాగే మరో 40 వేల రూపాయలను బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే డబ్బులు అవసరం వచ్చి మౌలి ఏటీఎంకు వెళ్లి మినీ స్టేట్‌మెంట్‌ తీయగా డబ్బులు డ్రా అయినట్లు గుర్తించింది. వెంటనే బ్యాంక్‌ అధికారులతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ