రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Published on Sat, 03/24/2018 - 11:28

సిర్పూర్‌(టి): మండలంలోని పారిగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మతి చెందగా ఓ వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సిర్పూర్‌(టి) ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ధనోరా గ్రామానికి చెందిన నాగుబాయి అనే వద్ధురాలు తన మనవరాలైన రాంటెంకి ఇషాని(04) ని తీసుకోని పారిగాం గ్రామంలోని ఓ పెళ్లి వేడుకలకు వచ్చింది. పారిగాం గ్రామంలో ఆటో దిగి గ్రామంలో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్తుండగా సిర్పూర్‌(టి) నుంచి లోనవెల్లి గ్రామం వైపు వెళ్తున్న లోనవెల్లి గ్రామానికి చెందిన ఔత్కర్‌ శరత్‌ బైక్‌తో వీరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇషాని మతి చెందింది నాగుబాయికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.    

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ