ప్రాణం తీసిన అనుమానం

Published on Sun, 12/24/2017 - 12:13

సాక్షి, కాకినాడ: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్యచేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వలస అలివేలు(28) అనే వివాహితను ఆమె భర్త వెంకటరమణ గత కొద్ది రోజులుగా అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం తలపై రాయితో కొట్టి అలివేలును చంపేశాడు. కాగా... ఆదివారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రాగా సమాచారమందుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ