amp pages | Sakshi

అదృశ్యమైన మహిళ.. కొండచిలువ కడుపులో!

Published on Sat, 06/16/2018 - 15:20

జకర్తా : తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది. రాకాసి కొండచిలువ ఆమెను మింగేసినట్లు ఒకరోజు తర్వాత గుర్తించారు. ఈ ఘటన ఇండోనేసియాలోని మునా ఐలాండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెర్సియపన్‌ లావెలా గ్రామంలో వా టిబా అనే 54 ఏళ్ల మహిళ కూరగాయలు కోసేందుకు తన తోటలోకి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది.

వా టిబా కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం రోజు వారి తోటలోకి వెళ్లి చూడగా.. 7 మీటర్ల (దాదాపు 23 అడుగుల) పొడవైన రాకాసి కొండచిలువను గుర్తించారు. అయితే అది వేగంగా కదలడం లేదని, అది టిబాను మింగేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు ఆ రాకాసి కొండచిలువను చంపి, దాన్ని కోసి చూడగా అందులో వా టిబా మృతదేహం ఉండటంతో కుటుంబసభ్యులు, స్థానికులు షాకయ్యారు.

పోలీస్‌ అధికారి హమ్కా మాట్లాడుతూ.. టిబా చెప్పులను గుర్తించి చుట్టుపక్కల వెతకగా స్థానికులకు కొండచిలువ కనిపించింది. ఆపై దాన్ని చంపి కోసి చూడగా టిబా మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా చిన్న చిన్న జంతువులను కొండచిలువలు తింటాయని, ఇక్కడ మహిళను(మనిషిని) బలితీసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లలో ఆరు, ఏడు మీటర్ల పొడవైన కొండచిలువలు ఉంటాయని హమ్కా వివరించారు.



 
 

#

Tags

Videos

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు

చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..

ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు

పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..

ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైన బాబు, పవన్

నాడు YSR..నేడు జగన్..ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక..

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)