ఆస్తి అమ్మైనా అప్పు తీర్చేస్తా..

Published on Fri, 06/15/2018 - 10:58

తల్లాడ: తన కుమారుడు రైతుల వద్ద నుంచి మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టినందువల్ల కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న మిర్చిని విక్రయించి రైతులకు పంపిణీ చేస్తానని, మిగిలిన పైకం కూడా తన ఆస్తులను అమ్మైనా చెల్లిస్తానని అఖిల పక్షానికి జలంధర్‌ తండ్రి ఎస్‌బీ ప్రసాద్‌ హామీ పత్రం రాసి ఇచ్చారు.

తల్లాడ శ్రీరామా, శ్రీ కృష్ణ కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో కొంత మిర్చి తన కుమారుడు ఉంచాడని, అది విక్రయించగా మిగిలిన సొమ్మును తన స్తోమత మేరకు చెల్లిస్తానన్నారు. గత నాలుగు రోజులుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో  ఐపీ వ్యాపారి జలంధర్‌ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపారి తండ్రి దిగి వచ్చి అఖిల పక్షానికి హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, బాధిత రైతులు గద్దె అశోక్, కొండల్‌రావు, కోయిన్ని వీరభద్రయ్య, సాయిన్ని వెంకటేశ్వరరావు, పడాల లక్ష్మయ్య, నాగేంద్రబాబు, గొడుగునూరి లక్ష్మారెడ్డి, యరమల నాగార్జున్‌రెడ్డి, వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రెడ్డెం రామకృష్ణ, కుప్పాల రామకోటయ్య, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ