వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి
Published on Wed, 07/11/2018 - 13:23
ఇంపాల్: మణిపూర్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున తమెంగ్లాంగ్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించిన సహాయక సిబ్బంది మిగిలిన ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కుండపోత వర్షాలు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి.
వరదలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత జూన్లో కురిసిన వర్షాలకు త్రిపుర, మణిపూర్, అస్సాంలలో కొండ చరియలు విరిగిపడి చాలా రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఆర్మీ, పారామిలటరీ బలగాలు అక్కడికి చేరి వారికి అండగా నిలిచాయి.
#
Tags