మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Published on Fri, 07/06/2018 - 11:39

విశాఖపట్నం: భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిందనే బాధతో పొట్యాడ గోపి (38) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన గోపి, అతని భార్య సత్య, ఇద్దరు పిల్లలతో ఈ ఏడాది జనవరిలో జీవీఎంసీ 51వ వార్డు గొడ్డువానిపాలెం వచ్చి నివాసముంటున్నారు. సెంటర్‌లో పకోడీ బండి వేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. వారం రోజలు కిందట తాగిన మైకంలో భార్యపై చేయి చేసుకోగా ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం గోపి పాపను తల్లి దగ్గర వదిలి బాబుని తీసుకొచ్చి నివసిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొడుకుని పెద్దమ్మ వరుస అయ్యే బంధువు దగ్గరకు వెళ్లమని పంపించాడు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు వచ్చి చూసేసరికి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ గోపి కనిపించాడు. వెంటనే స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. గోపి రాసిన లేఖలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏముందో ఎవరికీ వెల్లడించలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. భార్య, బంధువులు వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుని తదుపరి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ