అధ్యాపకులపై లైంగిక వేధింపుల కేసులు

Published on Tue, 10/10/2017 - 15:53

కటక్‌ : వైద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని లైంగికంగా వేధించిన ముగ్గురు అధ్యాపకులపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు చెబుతున్న మేరకు వివరాల మేరకు.. ఒడిశాలోని ఎస్‌జీబీ మెడికల్‌ కాలేజ్‌లో జార్ఖండ్‌కు చెందిన ఒక అమ్మాయి రెండో ఏడాది వైద్య విద్యను అభ్యసిస్తోంది. తమకు పడక సుఖాన్ని అందిస్తే.. పరీక్షల్లో మంచి మార్కులు వేస్తామని.. అసోసియేట్ ప్రొఫెసర్‌, డెంటల్‌ విభాగానికి చెందిన ఉన్నతాధికారి, మరో వ్యక్తి విద్యార్థిని కొంత కాలంగా లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై ఐపీసీ 354, ఐపీసీ 354ఏ, ఐపీసీ 294, ఐపీసీ 323 కేసులు నమోదు చేసినట్లు ఆయన పోలీసులు ప్రకటించారు. నిందుతులను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని కటక్‌ పోలీసులు ప్రకటించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ