amp pages | Sakshi

నవవధువు అనుమానాస్పద మృతి

Published on Mon, 06/08/2020 - 07:49

సాక్షి, పుట్టపర్తి ‌: వెంగళమ్మచెరువు గ్రామంలో నవ వధువు గీతాంజలి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే చిత్రహింసలు పెట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు మెట్టినింటి వారిపై ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పుట్టపర్తి, కొత్తచెరువు ఎస్‌ఐలు దాదాపీర్, వెంకటేశ్వర్లు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బకు చెందిన బొగ్గు కుళ్లాయప్ప, అలివేలమ్మ దంపతుల పెద్ద కుమార్తె గీతాంజలిని ముదిగుబ్బలోనే నివాసముంటన్న బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన ముసలప్ప, గంగమ్మ దంపతుల కుమారుడు అయిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సురేష్‌కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.1.5 లక్షలు కట్నం కింద అందజేశారు. అయితే తమకు అదనంగా మరో రూ.లక్ష కావాలంటూ మెట్టినింటి వారు వేధించేవారు.

నవదంపతులు శనివారం ఉదయం గంగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చి సాయంత్రం వెంగళమ్మచెరువులోని సురేష్‌ చిన్నాన్న చిన్నప్పయ్య ఇంటికి చేరుకున్నారు. చిన్నప్పయ్యకు చెందిన నూతన ఇంటిలో వారికి పడక ఏర్పాటు చేశారు. పొద్దుపోయిన తరువాత సురేష్‌ తన ముగ్గురు మిత్రులతో కలిసి పూటుగా మద్యం తాగాడు. ఇదే సమయంలో గీతాంజలి తన తల్లికి ఫోన్‌ చేసి తనకు భయమేస్తోందని, ఎవరో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో సురేష్‌ ఫోన్‌ అందుకుని ‘ఏమీ లేదులే అత్తా.. నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చి పెట్టేశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే గీతాంజలి ఉరికి వేలాడుతోంది. సురేష్‌ ఇంటి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇరుగుపొరుగు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, కొత్తచెరువు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. చదవండి: నెల రోజుల క్రితం వివాహం.. కొద్ది రోజులకే 

మృతిపై అనుమానాలు.. 
ఆదివారం ఉదయం కుమార్తె మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వెంగళమ్మచెరువు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న గీతాంజలిని చూసి బోరున విలపించారు. కంటి పక్కన, కుడి కాలిపైన, గొంతుకింద, గాయాలతో పాటు చేయి విరిగిన ఆనవాళ్లు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన అల్లుడు, వారి మిత్రులు, అతడి చిన్నాన్న కుటుంబ సభ్యులు కలిసి చిత్రహింసలు పెట్టి గీతాంజలిని చంపి.. తర్వాత ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. పోలీసులు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బొగ్గు కుళ్లాయప్ప ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్  

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)