సొంత గూటికి చేరేలోపే...

Published on Wed, 05/13/2020 - 17:20

లక్నో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలను మృత్యువు పలకరించింది. అయిన వారిని చూడకుండానే అనంతలోకాలకు చేర్చింది. ఈ విషాదకర సంఘటన కాన్పూర్‌ - ఝాన్సీ హైవేపై చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు వలస కూలీలు ఉపాధి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు దొరకకపోవడంతో సొంత ఊరికి ప్రయాణమయ్యారు.

దాదాపు 54 మంది ఓ ట్రక్కులో బయలు దేరారు. వలస కూలీల ట్రక్కు కాన్పూర్‌ - ఝాన్సీ హైవే మీద ఉండగా మరో ట్రక్కు వచ్చి దీన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పెద్దలతో పాటు ఓ చిన్నారి మరణించగా.. 43 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిని కాన్పూర్‌లోని లాలా లజపతి రాయ్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ