పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య

Published on Tue, 04/10/2018 - 06:31

సాక్షి, పరిగి: తను వద్దంటున్నా పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజుపల్లికి చెందిన నాగలూరప్పకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్న పెద్ద కుమార్తె కురుబ అశ్విని (22) హిందూపురం పరిధిలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద గార్మెంట్స్‌ పరిశ్రమలో పని చేస్తోంది. ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు.

తనకు ఇప్పుడే వద్దని, మరికొంతకాలం ఆగాలని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. అయినప్పటికీ గత ఆదివారం పెళ్లి విషయమై మరోసారి చర్చలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన అశ్విని సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన చెల్లెలు గమనించి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. ఏఎస్‌ఐ హబీబుల్లా, కానిస్టేబుల్‌ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ