19, 26న గంటపాటు పెట్రోలు బంక్‌ల బంద్

Published on Sun, 10/09/2016 - 01:15

పెట్రోల్ బంక్‌ల యూనియన్ వెల్లడి

 గుంటూరు రూరల్: డీలర్ మార్జిన్‌కు సంబంధించి 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అపూర్వచంద్ర కమిటీ నివేదికను ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 7 గంటల నుంచి 8 వరకు పెట్రోల్ బంక్‌లను మూసివేయనున్నట్లు పెట్రోల్ బంక్‌ల అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 3, 4 తేదీల్లో పెట్రోల్ కొనుగోలును నిలిపివేస్తామని చెప్పారు.

నవంబర్ 5న సాయంత్రం 6 వరకు మాత్రమే బంక్‌లు తెరిచి ఉంటాయని, అనంతరం బంద్ పాటించనున్నట్లు వెల్లడించారు. 6న పూర్తిగా బంద్ చేస్తామన్నారు.నవంబర్ 7 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే బంక్‌లను నిర్వహించాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి నెలలో 2, 4వ శనివారాలు, అలాగే ప్రతి ఆదివారం సెలవు దినాలుగా కమిటీ నిర్ణయించిందన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ