భర్త తాగి వస్తున్నాడని..

Published on Sun, 08/28/2016 - 18:24

భర్త రోజు మద్యం తాగి వస్తున్నాడని మనస్తాపానికి గురైన భార్య వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్లా, మస్తాన్‌బీ(26)లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య మద్యానికి బానిసైన భర్త రోజు తాగి వచ్చి వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన మస్తాన్‌బీ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిపోయింది. ఇది గుర్తించిన గ్రామస్థులు ఆమెను చికిత్స నిమిత్తం దర్శి ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని వైద్యులు సూచించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ