తల్లి సహా ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యం

Published on Sat, 10/01/2016 - 20:27

పిట్లం(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మెదక్ జిల్లా కంగ్టీ మండలానికి చెందిన రాజమణి అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో సహా కారులో నిజామాబాద్ వెళ్తుండగా.. పిల్లి వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. కారు అందులో కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి బయటపడిన డ్రైవర్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు.

డ్రైవర్ తో పాటు మృతురాలి తమ్ముడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు తాడు సాయంతో వారిని రక్షించారు. తల్లి సహా ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన ఐదుగురు చిన్నారులలో  ప్రియ (7), జ్యోతి (6), జ్ఞాన అశ్మిత (3), జ్ఞాన సమిత (3), గీతాంస (13) ఉన్నారు. మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ