పెళ్లికి నిరాకరించిన యువకుడిపై చీటింగ్‌ కేసు

Published on Thu, 06/15/2017 - 23:45

యల్లనూరు (యల్లనూరు) : నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లైనట్లు భావిస్తారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. కట్నం డబ్బులూ తీసుకున్నారు. పెళ్లి ఘడియలు సమీపించే సమయానికి కాబోయే వరుడు పెళ్లి చేసుకోనంటూ అడ్డం తిరిగాడు. దీంతో అతనిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. తాడిపత్రికి చెందిన వినోద్‌కుమార్‌కు యల్లనూరు మండలానికి చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. గత నెల 24న తాంబూలాలు సైతం తీసుకున్నారు. రూ.3 లక్షల వరకు కట్నం డబ్బులూ ముట్టాయి. ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదంటూ మొండికేయడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులపైనా యువతి తండ్రి ఫిర్యాదు మేరకు చీటింగ్‌ కేసు గురువారం నమోదు చేసినట్లు యల్లనూరు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ