అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Published on Sun, 08/16/2015 - 15:10

ఒంగోలు: ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను నిజం చేసుకునేందుకు దేశంకాని దేశం వెళ్లాడు. అయితే విధి అతని ఆశలు ఆదిలోనే తుంచివేసింది. ఉన్నత చదువులు చదివి తిరిగి వస్తాడనుకున్న కొడుకు దేశం వదిలి వెళ్లి నెలరోజులు గడువక ముందే విగతజీవి అయ్యాడని తెలిసిన ఆ తల్లిదండ్రుల గుండెలు పుట్టెడు శోకంతో నిండిపోయాయి. వివరాలు... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన తాటికొండ రమేష్ పేరాల మసీదు సెంటర్‌లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రమేష్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు తాటికొండ బాలసురేంద్రకుమార్ (25) 2007లో తంజావూరులోని శస్త్ర ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదివాడు. చదువుతున్న రోజుల్లో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించి చెన్నైలో మూడు సంవత్సరాలు పనిచేశాడు.

అయితే ఎంఎస్ చదివేందుకు ఉద్యోగాన్ని వదిలి గత నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ వెళ్లాడు. బాలసురేంద్రకుమార్ 14వ తేదీన చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వారంతపు ఆటవిడుపు కోసం స్నేహితులతో కలిసి విహారయత్రకు వెళ్లాడు. అక్కడ ఉన్న జలపాతం వద్ద ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఎన్నారై కావడంతో టెక్సాస్‌లోని తానా సభ్యులతో మాట్లాడారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా చీరాలకు తీసుకువచ్చేందుకు వారితో మాట్లాడారు. కొడుకు మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ