పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు
Published on Wed, 09/14/2016 - 23:09
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5న ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ముగింపు పూజల్లో భాగంగా స్వామివార్ల రుద్రయాగశాలలో జయాదిహోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబధోత్సవం, కలశోద్వాసన నిర్వహించారు. నారికేళాలు, సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతనవస్త్రాలు తదితర ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్ గుప్త,జెఈఓ హరినాథ్రెడ్డి, అర్చకులు, వేదపంyì తులు హోమగుండానికి సమర్పించారు. అనంతరం యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకుడికి వ్రతకల్పపూర్వక ప్రత్యేకపూజలు చేశారు.ఆలయప్రాంగణంలోని మల్లికాగుండంలోఅభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిదిరోజులపాటు ఆగమ శాస్త్రానుసారం గణపతికి వేదపండితులు, అర్చకులు మండపారాధనలు, ఉపనిషత్తు పారాయణలు, జపానుష్టానాలు, హోమం, సాయంకాల పూజలు నిర్వహించినట్లు ఈఓ తెలిపారు.
#
Tags