తుంగభద్రలో పడి కర్నూలువాసి మృతి

Published on Sun, 12/06/2015 - 17:56

అలంపూర్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ తుంగభద్ర నదిలో పడి మృతిచెందాడు. కర్నూలు వివేక్నగర్‌కు చెందిన రమేష్‌బాబు(52), శారద(47) దంపతులు జోగులాంబ దర్శనార్థం ఆదివారం అలంపూర్ వచ్చారు.

తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు దిగిన రమేష్‌బాబు ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడ్డాడు. వెంటనే ఒడ్డున కూర్చున్న శారద కేకలు వేయడంతో అక్కడున్నవారు రమేష్‌బాబును కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. రమేష్‌బాబు కర్నూలు జిల్లా కానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శారద అదే గ్రామంలో టీచర్‌గా పనిచేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ