స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
మెట్టుపల్లిని ఇల్లంతకుంటలో కలపాలి
Published on Sat, 09/17/2016 - 00:51
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
- జోరు వానలోనూ మూడు గంటల పాటు నిరసన
హన్మకొండ అర్బన్ : మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో కలపాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సుమారు మూడు గంటల పాటు వర్షంలోనే ధర్నా చేయడం గమనార్హం. తమ గ్రామాన్ని ఇల్లంతకుంటలో కలపడం వల్ల అన్ని విధాల సౌకర్యంగా ఉటుందని ఈ సందర్భంగా స్థానికులు తెలిపారు. మొగుళ్లపల్లి మండల కేంద్రం కన్నా...ఇల్లంతకుంట తమ గ్రామానికి దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామం నుంచి పెద్దసంఖ్యలో మహళలు తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట కోలాంటం వేస్తూ నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
#
Tags