నిర్మల్ జిల్లా ఏర్పాటు విరమించుకోవాలి

Published on Fri, 08/19/2016 - 12:30

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా మాత్రమే విభజించాలంటూ జిల్లా పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం ఉదయం పట్టణానికి చేరుకున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను జిల్లా పరిరక్షణ సమితి సభ్యులు ఘెరావ్ చేశారు. అనంతరం ఆయనకు పరిరక్షణ సమితి నాయకులు వినతి పత్రం సమర్పించారు.

ఆదిలాబాద్, మంచిర్యాలతోపాటు నిర్మల్‌ను కూడా జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని..అయితే నిర్మల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను విరమించేలా కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని వారు స్వామిగౌడ్ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. మీ అభ్యర్థనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇచ్చారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ