బోటు నుంచి పర్యవేక్షణ

Published on Sun, 08/21/2016 - 20:14

ఐజీ సంజయ్‌ ఘాట్‌ల పరిశీలన 
 
గుంటూరు రూరల్‌ (అమరావతి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే స్నానపు ఘాట్‌లను ఐజీ సంజయ్‌ ఆదివారం బోట్‌ ద్వారా ప్రయాణిస్తూ పరిశీలించారు. తాళ్ళాయపాలెం ఘాట్‌నుంచి బయలుదేరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని స్నానపు ఘాట్‌లను ఆయన పరిశీలిస్తూ అమరావతిలోని అమరేశ్వర ఘాట్‌వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళాయపాలెంనుంచి అమరావతి వరకూ ఉన్న ప్రతి ఘాట్‌ను పరిశీలించానని కొన్ని ప్రాంతాల్లో స్నానాలకు అనువుగాని చోట ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తాళాయపాలెంనుంచి అమరావతి ఘాట్‌వరకూ సుమారు రెండున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉండడం, తగిన రక్షణ చర్యలు ఉండడంవల్ల భక్తులు ఆనందంగా స్నానాలు ఆచరిస్తున్నారన్నారు.
 
 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ