బాబుకు పోల‘వరం’

Published on Wed, 09/21/2016 - 23:22

– ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి
మదనపల్లె రూరల్‌: కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకునేయచ్చనే దురాశతోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని చంద్రబాబు కోరారని ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడడం దారుణమనానరు. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటిస్తే పదేళ్లు ఇవ్వాల్సిందేనని నోరు పారేసుకుని నానాయాగీ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు జారాననడం సబబు కాదన్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీతో సంతృప్తి పడదామంటున్న టీడీపీ నాయకులకు వాటి మధ్య ఉన్న తేడా తెలుసా అంటా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ రాజీ పడడం తప్ప పోరాటం చేసే సత్తా చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. హోదా అనేది దేశంలో నిమ్నకులాలకు కల్పిస్తున్న రిజర్వేషన్‌ లాంటిదన్నారు. తద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రెయిన్‌గన్స్‌ పేరుతో రూ.270 కోట్లు వృథా చేశారని, ఆ నిధులను వెనుకబడిన మండలాలకు కేటాయించి ఉంటే కనీసం అభివృద్ధి పనులన్నా జరిగేవన్నారు. వేరుశనగ పంట ఎండిపోయి రైతులు నష్ట పరిహారం కోసం ధర్నాలు చేసే స్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ