ఆ రైతులకు ఇచ్చేది లక్షన్నరే: ప్రత్తిపాటి

Published on Sat, 09/05/2015 - 17:36

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు మాటతప్పింది. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారంలో భారీగా కోత విధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీసినపుడు.. రూ.5లక్షలు ఇస్తామని వ్యవసాయమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, జిల్లాలోని 33 మంది రైతులకు రూ.లక్షన్నర మాత్రమే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రత్తిపాటి పుల్లారావు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 ముందు మరణించినందున ఐదు లక్షల ప్యాకేజీ వర్తించదని మంత్రి చెప్పారు. వారంతా 2013 - 14 మధ్య చనిపోయిన వారు.. కానీ, అసెంబ్లీలో అధికారులు సరైన సమాచారం అందించలేదని.. అందుకే అలా ప్రకటించాల్సి వచ్చిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ