నిండు గర్భిణి ఆత్మహత్య

Published on Fri, 12/09/2016 - 22:36

తెనాలి రూరల్‌ : స్వల్ప విషయంపై గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వెనుక ఉన్న పోతురాజు కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన బత్తుల సుబ్రహ్మణ్యంకు సమీప బంధువు చాముండేశ్వరి (19)తో ఏడాది కిందట వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. మందులు సరిగా వేసుకోకపోవడంతో భర్త భార్యను మందలించి వెళ్లాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలాన్ని వన్‌ టౌన్‌ సీఐ బి. శ్రీనివాసరావు, ఎస్‌ఐ కె. వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ