ఘనంగా ముత్యాలమ్మ జాతర

Published on Mon, 08/29/2016 - 20:45

హుజూర్‌నగర్‌ : శ్రావణమాసంలో ప్రతి ఏటా పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పీర్లకొట్టం వీధి సమీపంలోని మూడుగుళ్ల ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో వందలాదిగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి డప్పువాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక మూడుగుళ్ల ముత్యాలమ్మ ఆలయం వద్ద భక్తులకు మంచినీరు సరఫరా చేశారు.  ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్‌నగర్‌ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్‌ బందోబస్తును  ఏర్పాటు చేశారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ