వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రబీ రుణ లక్ష్యం.. రూ.782.55 కోట్లు
Published on Wed, 10/12/2016 - 23:25
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో రూ.782.55 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డీఎం) ఎల్.జయశంకర్ వెల్లడించారు. ఈ నెల చివరి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. కాగా.. సెప్టెంబర్ 30తో ముగిసిన 2016 ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని వంద శాతం సాధించినట్లు తెలిపారు. 5.95 లక్షల మంది రైతులకు రూ.4,434 కోట్ల పంట రుణాలు, 82 వేల మందికి రూ.550 కోట్ల బంగారు రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ టర్మ్ రుణాల పంపిణీ కొనసాగుతోందన్నారు.
#
Tags