వరదనీటిలో చిన్నారులు..

Published on Sat, 09/24/2016 - 22:04

ఆల్విన్ కాలనీ: అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఓ పాఠశాల యాజమాన్యం స్కూల్‌ నడపగా...చిన్నారులు వరదనీటిలో చిక్కుకుని అల్లాడిపోయారు. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు శనివారం ధరణీనగర్‌లోని చిన్నారులను పాఠశాలకు తీసుకువెళ్ళడానికి కాలనీలోకి వచ్చింది.

ఆ సమయంలో రహదారిపై భారీగా వరదనీరు ఉండడంతో సైలెన్సర్‌లోనికి నీరు వెళ్లి బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, మీడియా సిబ్బంది బస్సును రోడ్డు వరకు తోసి చిన్నారులను కాపాడారు. మరో బస్సును తీసుకువచ్చి పిల్లలను సురక్షితంగా తీసుకువెళ్లారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ