జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
సైన్స్ కాంగ్రెస్కు శ్రీ నలంద విద్యార్థిని ఎంపిక
Published on Thu, 12/01/2016 - 18:46
సిద్దవటం: సిద్దవటం లోని శ్రీ నలండ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లక్ష్మిప్రసన్న అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైయారని ఆ పాఠశాల కరస్పాండెంట్ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి కడప లోని సైన్స్ మ్యూజియంలో జరిగిన 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలో తమ పాఠశాలకు విద్యార్థిని లక్ష్మిప్రసన్న ఆహారం మరియు వ్యవసాయం అనే అంశంపై సెమినార్లో పాల్గొని చక్కటి ప్రతిభను కనపరచడంతో న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. డిశంబర్ 3,4, తేదీలలో విజయవాడలో జరిగే రాష్ఠ్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ విద్యార్థికి గైడ్ ఉపాధ్యాయుడుగా నరసింహబాబు వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో గురువారం లక్ష్మిప్రసన్న ను ప్రధానోపాధ్యాయుడు లోకేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Tags