యాడికిలో రైతు భరోసా యాత్ర ప్రారంభం.. ఉద్రిక్తత

Published on Fri, 06/03/2016 - 11:13

అనంతపురం జిల్లా యాడికి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన ఎంపీపీ వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు.

బస్టాండ్ సెంటర్‌లో రెండుపార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణలకు తావులేకుండా చూసేందుకు పోలీసులు టీడీపీ శ్రేణులను వెనక్కి పంపారు. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు బస్టాండ్ సెంటర్‌లో బైఠాయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రోడ్డుషో ఆలస్యం అయ్యింది. టీడీపీ శ్రేణులను పూర్తిగా పంపించిన తర్వాతే రోడ్డుషోకు లైన్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ