వాగులో పడి బాలిక గల్లంతు

Published on Sat, 10/15/2016 - 17:09

ఖానాపూర్ (ఆదిలాబాద్) : వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. ఇది గుర్తించిన ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు బాలికలను రక్షించగా.. మరో బాలిక గల్లంతైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్‌మాటు వాగు వద్ద శనివారం చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఓ ముస్లిం కుటుంబం సదర్‌మాటు వాగును సందర్శించడానికి వచ్చింది. ఆ సమయంలో వాగులో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఇద్దరిని రక్షించగా.. మరో బాలిక(15) నీట మునిగి గల్లంతైంది. గల్లంతైన బాలిక కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ