వైభవంగా లక్ష తులసిపూజ

Published on Sun, 08/07/2016 - 22:49

సూర్యాపేటటౌన్‌ : బదరినారాయణ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆదివారం లక్ష తులసిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ నారాయణమంత్రాన్ని లోకానికి అందించిన బదరీనారాయణ మంత్రాన్ని పఠించిన వారికి మాత్రమే మోక్షం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది పఠించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్‌వీ సత్యనారాయణ, ఉప్పల గోపాలకృష్ణ, కృష్ణమూర్తి, రవీందర్, మంజుల, అరుణ, నాగమ్మ, మాధవరావు, అరుణ, సరోజ, సంకర్షణాచార్యులు, శ్రీహరిఆచార్యులు, ఫణికుమారాచార్యులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 
రేపు సుదర్శన హోమం
ఈ నెల 9న మంగళవారం శ్రీసుదర్శన జయంతి సందర్భంగా దేవాలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నట్టు దేవాలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు తెలిపారు. భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు.   
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ