గాలిగోపురం నుంచి పడి యువకుడి మృతి

Published on Sat, 10/01/2016 - 20:25

అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో దేవాలయం గాలిగోపురం పైనుంచి యువకుడు ప్రమాదవశాత్తు పడి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. దసరా నవరాత్రులు సందర్భంగా అత్తలూరు సోమేశ్వరస్వామి దేవస్థానం గాలిగోపురానికి విద్యుత్‌ లైటింగ్‌ వేయటానికి అదే గ్రామానికి ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ చిలకా శ్రీనివాసరావు (సీమోన్‌)(19) శనివారం గాలిగోపురం పైకి ఎక్కాడు. ఈక్రమంలో అతను ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తలకు బలమైన గాయమై సంఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న అమరావతి పోలీసులు శ్రీనివాసరావు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.  మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ