మళ్లీ పిల్లలు పుట్టడం సాధ్యమేనా?

Published on Sun, 09/18/2016 - 01:33

సందేహం
నా వయసు 30. పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. మొన్ననే సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. కానీ నెలరోజులకే చనిపోయాడు. ఇన్ఫెక్షన్ వల్లే అలా జరిగిందన్నారు. సమస్య ఏంటంటే బాబు పుట్టినప్పుడు నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. దాంతో ఇప్పుడు పిల్లలు లేకుండా పోయారు. మళ్లీ పిల్లలు పుట్టటానికి ఏదో ఆపరేషన్ చేస్తారని విన్నాను. అది సాధ్యమేనా? సాధ్యమైతే ఎంత ఖర్చవుతుందో తెలపండి.

- మాధురి, తగరపువలస
 
ఒక్కొక్కరి కుటుంబ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక బిడ్డ చాలు అనుకోవడం సబబే. కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇకపై పిల్లలు పుట్టకుండా చేసుకునే శాశ్వత మార్గం. కాకపోతే ఒక బిడ్డ చాలనుకున్నప్పుడు, బిడ్డకు కనీసం నాలుగైదు సంవత్సరాల వయసు వచ్చేవరకు ఉంటే మంచిది. ఎందుకంటే అప్పటికి ఆ బిడ్డలో ఏవైనా సమస్యలు ఉంటే బయటపడతాయి. అంతేకాకుండా అప్పటికి టీకాలు తీసుకోవడం కూడా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి, టెంపరరీ పద్ధతులయిన కండోమ్స్, పిల్స్, లూప్ వంటివి పాటిస్తే మంచిది. లేదంటే మీరు చెప్పిన సమస్య వస్తుంది.

పైగా ఒక బిడ్డ చాలు అని నిర్ణయించుకున్న కొంతకాలానికి పరిస్థితులు మారవచ్చు. లేదంటే ఈ బిడ్డకి ఇంకో బిడ్డ తోడుంటే బాగుణ్ను అనిపించొచ్చు. కాబట్టి బిడ్డకు నాలుగైదేళ్లు వచ్చేవరకూ ఆగితే బాగుంటుంది. అప్పటికీ నిర్ణయంలో మార్పు లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇది ఒక బిడ్డ చాలనుకునే వారికి ఓ డాక్టర్‌గా నేనిచ్చే సలహా. ఇక మీ విషయానికొస్తే, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు గర్భాశయానికి రెండు వైపులా ఉండే ట్యూబ్స్‌ను మధ్యలో ముడివేసి కత్తిరిస్తారు.

మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, కత్తిరించిన ట్యూబులను మళ్లీ అతికి ంచడం (రీ క్యానలైజేషన్) ద్వారా ప్రయత్నించవచ్చు. కానీ దీని సక్సెస్ రేటు ఆపరేషన్ ఎక్కడ, ఎలా చేశారు, ఎంత ట్యూబ్ కత్తిరించారు వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధైర్యపడకుండా బాగా అనుభవం ఉన్న డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్‌ను బట్టి, హాస్పిటల్‌ను బట్టి పదిహేను వేల నుంచి యాభై వేల వరకూ ఖర్చు కావచ్చు. అలా ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే, టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు.
 
నా వయసు 23. బరువు 50 కిలోలు. బ్లడ్ గ్రూపు ‘ఒ’ పాజిటివ్. మావారి వయసు 26. ఆయనది కూడా ‘ఒ’ పాజిటివే. పెళ్లయ్యి పదిహేడు నెలలయ్యింది. ఎనిమిది నెలల వరకూ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. డాక్టర్ సలహాపై మందులు వాడితే వచ్చింది. కానీ నాలుగో నెల నిండేవరకూ కొద్దికొద్దిగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. డాక్టర్ స్కాన్ చేసి సమస్య ఏమీ లేదని చెప్పారు. తొమ్మిదో నెల వచ్చాక విపరీతమైన కడుపునొప్పి వచ్చి, బిడ్డ కడుపులోనే చనిపోయాడు. కానీ నార్మల్ డెలివరీ అయ్యింది. మాది మేనరికం కాదు. ఇలా ఎందుకు జరిగింది? నాలుగో నెల నుంచి డెలివరీ అయ్యేవరకూ డాక్టర్ స్కాన్ చేయించలేదు. అది కరెక్టేనా? మళ్లీ గర్భం వస్తే సమస్యలు వస్తాయా?
 - తరుణి, తూర్పుగోదావరి
 
తొమ్మిదో నెలలో బిడ్డ కడుపులో చనిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయంలో పెరిగే బిడ్డకి, తల్లి నుంచి మాయ (ప్లాసెంటా), బొడ్డు తాడు ద్వారా రక్తప్రసారం జరిగి, తద్వారా ఆహారం, ఆక్సిజన్, కొంత ఉమ్మనీరు సరఫరా అవుతుంటాయి. నెలలు నిండేకొద్దీ కొంతమందిలో మాయ పనితీరు తగ్గి, బిడ్డకు అందాల్సిన రక్తం, ఆక్సిజన్ ప్రసరణ మెల్లగా తగ్గి, తర్వాత పూర్తిగా ఆగిపోవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు. కొన్నిసార్లు ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ మెడచుట్టూ పేగు బిగుతుగా చుట్టుకోవడం, తల్లికి బీపీ బాగా పెరగడం, గర్భాశయం నుంచి బిడ్డ బయటకు రాకముందే మాయ విడిపోవడం వంటి కారణాల వల్ల కూడా బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు.
 
అవసరాన్ని బట్టి రెండో నెల చివర్లో, ఐదో నెలలో బిడ్డ అవయవాలు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా అని, తర్వాత తొమ్మిదో నెలలో బిడ్డ బరువు, పొజిషన్, ఉమ్మనీరు ఎలా ఉన్నాయా అని స్కానింగ్ చేస్తారు. కొంతమందికి మాత్రం ఆరోగ్య పరిస్థితిని బట్టి, రెగ్యులర్ చెకప్‌లో బిడ్డ పెరుగుదలలో ఏమైనా తేడా కనిపించిప్పుడు మధ్యలో కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్‌కి తెలియవచ్చు. కాబట్టి మీరు ఓసారి తననే సంప్రదించి మీ నుమానాలను నివృత్తి చేసుకుంటే బాగుంటుంది. ఒక కాన్పులో ఇలా అయ్యిందని మళ్లీ అలాగే అవ్వాలని లేదు. మీకు కాన్పు ఈ మధ్యనే అయ్యింది కాబట్టి, ఆరునెలల నుంచి సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ గర్భం కోసం ప్రయత్నిస్తే మంచిది.
- డా॥వేనాటి శోభ
 లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)