జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
విమానం అత్యవసర ల్యాండింగ్
Published on Sat, 08/01/2015 - 21:24
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది. వివరాలు.. శనివారం సాయంత్రం 6.53 గంటలకు శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా-514 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఏటీసీ అనుమతితో తిరిగి 7.11 గంటలకు విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ నిపుణులు విమానానికి మరమ్మతులు చేస్తున్నారు. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
#
Tags