పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది'
Published on Sat, 03/19/2016 - 13:19
హైదరాబాద్ : మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మిషన్ కాకతీయలో భాగంగా ఉపయోగించే ప్రతిపైప్నకు ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ సలహాలు, సూచనలను ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. అయితే తమ సూచనలు, సలహాలను ఈ ప్రభుత్వం అవహేళన చేస్తే... అది రాజ్యాంగానికే విరుద్ధమని భట్టి పేర్కొన్నారు. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం విన్నాం కానీ... బడ్జెట్యేతర వ్యయం మాట మాత్రం ఇప్పుడే వింటున్నామని భట్టి వ్యాఖ్యానించారు.
#
Tags