పర్యాటకురాలితో క్యాబ్‌ డ్రైవర్‌ వికృత చేష్టలు

Published on Wed, 04/19/2017 - 02:48

వాట్సాప్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
నిందితుడిని అరెస్టు చేసిన ‘షీ–టీమ్స్‌’


సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల క్యాబ్‌ డ్రైవర్‌ వికృతంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నుంచి క్యాబ్‌ను ఎంగేజ్‌ చేసుకున్నారు. ఈ వాహనానికి పహాడీషరీఫ్‌కు చెందిన నలభై ఏళ్ల మహ్మద్‌ సలీం డ్రైవర్‌గా వచ్చాడు. పర్యటన అనంతరం తిరిగి వెళ్లేందుకు అంతా రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు.

బాధితురాలు డ్రైవర్‌ పక్క సీటులో కూర్చోగా... కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారు. దారిలో డ్రైవర్‌ సలీం వికృతంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తీవ్ర జుగుప్సకు లోనైన బాధితురాలు కారు ఆపమని చెప్తున్నా వినకుండా ముందుకు వెళ్లాడు. చివరకు బలవంతంగా కారు ఆపించి కిందికి దిగిన బాధితురాలు తన తండ్రితో పాటు బంధువుకు విషయం చెప్పారు. వారు ప్రశ్నిస్తుండగానే.. లగేజ్‌ను నడిరోడ్డుపై పడేసిన సలీం అక్కడి నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు అప్పుడే ట్రావెల్స్‌ నిర్వాహకుడికి ఫిర్యాదు చేసినప్పటికీ సమయాభావంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు చేరుకున్న తర్వాత షీ–టీమ్స్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ