చంద్రబాబు మేనిఫెస్టో మాయలు
Breaking News
కేసీఆర్కు ఊరట.. కేసులన్నీ కొట్టివేత
Published on Tue, 06/21/2016 - 03:02
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల వ్యవహారంలో సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2008 ఉప ఎన్నికల సందర్భంగా ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
2008 ఉప ఎన్నికల్లో కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశా రు. వీటి ఆధారంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. కేసీఆర్ తరఫున న్యాయవాది గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు.
Tags