amp pages | Sakshi

3 రోజుల పాటు నిర్బంధించి పర్యాటకురాలిపై అత్యాచారం

Published on Sun, 04/30/2017 - 02:09

- నగ్న వీడియోలను తీసిన నిందితులు.. ఒకరి అరెస్టు
- సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో ఘటన...


హైదరాబాద్‌: రాజధానిలో దారుణం... నగర అందాలను వీక్షించడానికి కోల్‌కతా నుంచి వచ్చిన ఓ యువతిని నిర్బంధించి మూడు రోజులపాటు అత్యా చారానికి పాల్పడ్డారు కామాంధులు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల్లో ఒకరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోల్‌కతాకు చెందిన బీకాం విద్యార్థిని (19) ఫిబ్రవరి 14న నగర పర్యటన నిమిత్తం శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగింది.

సికింద్రాబాద్‌ పార్క్‌ హోటల్‌కు షేరింగ్‌ క్యాబ్‌ ఎక్కింది. క్యాబ్‌లో ఉన్న మరో మహిళ పింకీ రాయ్‌... తానూ పర్యాట కానికి వచ్చానని యువతితో చెప్పి పరిచయం పెంచుకుంది. నమ్మిన యువతి పింకీరాయ్‌ హోటల్‌ కు వెళ్లింది. ఫిబ్రవరి 15న ఇద్దరూ కలసి నగరంలో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో తన స్నేహితుడు ప్రీత్‌షార్గిల్‌ అలియాస్‌ రాజ్‌వీర్‌సింగ్‌కు కారు ఉందని, అందులో వెళదామని పింకి చెప్పింది. నమ్మిన యువతి పింకీతో కలసి రాజ్‌వీర్‌ కారు ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తరువాత పింకి... పని ఉందని, సాయంత్రం హోటల్లో కలుస్తానని చెప్పి దిగిపోయింది.

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి...
రాజ్‌వీర్‌... ఈస్ట్‌ మారేడుపల్లి మిషా మాన్‌సూ న్‌లోని తన అపార్టుమెంట్‌కు యువతిని తీసుకు వెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి వద్దనున్న రూ.7వేల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు రాజ్‌వీర్‌ డ్రైవర్‌ సుల్తాన్‌ అలియాస్‌ నీరజ్, ఆ తరువాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి యువతిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల అనంతరం మళ్లీ అత్యాచారం చేసి, నగ్న చిత్రాలను వీడియోలో బంధించి, వారి స్నేహితులకు పంపారు.

టిష్యూ పేపర్‌పై రాసి...
కాగా, ఫిబ్రవరి 18న తన తండ్రికి సమాచారం ఇవ్వాలంటూ బాధితురాలు తన వివరాలను గదిలో ఉన్న టిష్యూ పేపర్‌పై రాసి పక్కింటిలో పడేసింది. ఇది గమనించిన నిందితులు భయంతో ఆమెను వెంటనే క్యాబ్‌లో శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకువెళ్లి వదిలేశారు. బాధితురాలు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కమిషనర్‌ ఆదేశాలతో మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.

పరారీలో నిందితులు...
మిషా మాన్‌సూన్‌ అపార్టుమెంట్‌పై నిఘా పెట్టిన పోలీసులు శనివారం రాజ్‌వీర్‌సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. పింకీరాయ్, సుల్తాన్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Videos

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)