Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మడిచి.. జేబులో పెట్టుకోండి!
Published on Sun, 01/27/2019 - 01:41
చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ షియోమీ ఓ వినూత్నమైన స్మార్ట్ఫోన్ను తయారు చేసింది. ఇలాంటి ఫోన్లను ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగరు. మొబైల్ను పర్స్ లాగా మడుచుకుని వాడొచ్చు. సరిగ్గా మధ్యకు మూడు, నాలుగు మడతలు వేయొచ్చు. మడిచిన ప్రతిసారి కూడా స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ను కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. అరచేతిలో ఇమడలేనంత ట్యాబ్లెట్ పీసీ సైజు నుంచి చిన్న పాటి సైజు మొబైల్ వరకు దీన్ని మడుచుకోవచ్చు. దీన్ని షియోమీ కంపెనీ ‘చైనా ఆపిల్’అని ముద్దుగా పిలుచుకుంటోంది. ఈ మొబైల్కు ఇంకా పేరు పెట్టలేదని, ఏదైనా మంచి పేరు సూచించాలని ఈ కంపెనీ ప్రెసిడెంట్ లిన్ బిన్ కోరుతున్నారు. ఈ మొబైల్స్కు సరైన డిమాండ్ ఉంటే త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
#
Tags