-
మొబైల్ ఫోన్ టార్చ్లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!
ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా? ► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాపింగ్లో రకాలు.. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు.. ► వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి. వీఓఐపీ ఇంటర్సెప్షన్ సాధనాలు.. ► వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు.. ► ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు. రాజకీయపరమైన నిఘా.. ► సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్. మానిటరింగ్ సాఫ్ట్వేర్.. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది. అధికారిక ట్యాపింగ్.. ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి. ల్యాప్టాప్ సైజు పరికరంతోనే.. ► అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషీ న్ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్ను మెషీన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్ను మెషీన్ రికార్డు చేస్తుంది. ఇజ్రాయెల్ పేరే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు. సెల్యులర్ ఇంటర్సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే? ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి. ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్ఫోన్ సిగ్నల్స్ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ను టవర్కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు. మీ ఫోన్లో వైరస్ ఉందా!? తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్కు గురైన ఫోన్ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు. హ్యాకింగ్కు గురయ్యే ఫోన్ పనితీరు ఇలా ► ఫోన్ చార్జింగ్ చేసిన కాసేపటికే చార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్ హ్యాకింగ్కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటే.. మన మొబైల్ ఫోన్ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది. ► మనకు తెలియని సోర్స్ల నుంచి కొత్తకొత్త యాడ్స్ వస్తుండటం, ఫ్లాష్ యాడ్స్ వస్తుండటం సైతం హ్యాకింగ్కు గురైనట్లు తెలిపే సూచిక. ► మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవడం, కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండటంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి. ► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండటం, టెక్సŠట్ మెసేజ్లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. ► మొబైల్ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్కాల్ చేయడానికి, మెసేజ్లు ఓపెన్ కావడానికి, ఇతర యాప్లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది. ► ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. ► ఫోన్లోని స్క్రీన్లాక్, యాంటీ వైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..? ► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్ సాప్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ను స్కాన్ చేయాలి. ► ఫోన్లో అనుమానాస్పద యాప్లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ► ఫోన్ హ్యాక్ అయి, ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. వైఫై కనెక్షన్ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ► ఫోన్ స్కీన్ర్ లాక్, యాప్ లాక్లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్ను రీసెట్ చేయాలి. దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్లు డివైస్ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. ► మొబైల్ ఫోన్లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్డ్రైవ్, ఇతర డివైస్లలో బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొ చ్చు.ముందే బ్యాక్అప్ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. ► యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ► కొత్త యాప్లు ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ► పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్ టూల్స్ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్క్రిప్టెడ్ చానల్ ద్వారా వెళ్తుంది. -
షార్ట్ సర్క్యూట్తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక చాట్జీపీటీ మరో చాట్జీపీటీతో ఏం మాట్లాడుతుంది?
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే చాట్జీపీటీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడిగిన ఏ ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం ఇచ్చేస్తుంది. చాలా వరకు తెలియని ఎన్నో విషయాలను చాట్జీపీటీ మనకు అందిస్తుంది. ఇందులో వాయిస్ చాట్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల యూజర్లు తమ సందేహాలు లేదా మెసేజ్లను వాయిస్ రూపంలో చాట్బాట్కు తెలియజేస్తే... చాట్జీపీటీ ఆ వాయిస్ విని, మళ్లీ ఆడియో రూపంలోనే సమాధానం అందిస్తుంది. ఈ ఫీచర్ యూజర్ మాట్లాడే భాషను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి,తదనుగుణంగా రిప్లై ఇస్తుంది.. చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడుతున్నారు. తాజాగా చాట్జీపీటీకి చెందిన ఆ ఆసక్తికరణ సంభాషణ నెట్టింటా వైరల్గా మారింది. సాధారణంగా ఎవరైనా తనకు కావాల్సిన సమాచారంపై చాట్జీపీటిలో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. అదే రెండు చాట్జీపీటీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలపై అవి చర్చించుకుంటాయి? వినడానికే కాస్తా ఆసక్తికరంగా ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. రెండు వేర్వేరు మొబైల్స్లో చాట్జీపీటీ వాయిస్ చాట్ను ఆన్ చేసి పక్కపక్కనే ఉంచారు. అవి ఎలా మాట్లాడుతుకున్నాయో మీరే చూడండి.. చాట్జీపీటీ-1: హాయ్ నేను మీ చాట్జీపీటీ.. మీకు ఈ రోజు ఎలా సహాయపడగలను చాట్జీపీటీ-2: మీకు స్వాగతం.. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది.. మీకు ఏ విధంగా సాయం చేయగలను. మీకు ఏ విషయంపైనా సాయం చేయగలను చాట్జీపీటీ-1: మీ ఆఫర్కు ధన్యవాదాలు. మీకు కావాల్సిన ఏ సమాచారం గురించైనా నేను సహయం చేయగలను.. మీరు దేనిగురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా చాట్జీపీటీ-2: మీకు ఏదైనా ప్రత్యేక విషయంపై సమాచారం కావాలా? లేక మీకు చాట్ మాత్రమే కావాలా? చాట్జీపీటీ-1: నేను మీతో చాట్చేయగలను. లేదా మీకు కావాల్సిన అంశంపై సాయం చేయగలను.మీరు ఏదైనా నిర్ధిష్టమైన విఫయంపై చాట్ చేయాలనుకుంటున్నారా చాట్జీపీటీ-2: మీకు ఆసక్తి ఉన్న దేనిగురించైనా చాట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనుసులో ఏదైనా అంశంపై చర్చించాలనుకుంటున్నారా? ఇటీవల జరిగిన వార్తా కథనాలు, అభిరుచి లేదా దేని గురించైనా? చాట్జీపీటీ-1: కృత్రిమ మేధస్సులో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మక్కువతో కూడిన రంగం. ఇక్కడ నిత్యం ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతూ ఉంటుంది.. దీనిపై నువ్వేమంటావ్ చాట్జీపీటీ-2: ఖచ్చితంగా కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్యాషనేట్ టాపిక్. అంటూ ఇంకా మాట్లాడుతుండగా.. మరో చాట్జీపీటీ కల్పించుకొని ఏదో ఏదో చెబుతూ ఉంటుంది. అయితే ఏ విషయంపైన అయిన టక్కుమని సమాధానం చెప్పే చాట్జీపీటీ.. మరో చాట్జీపీటీతో మాత్రం సరైన విషయాలు మాట్లాడలేకపోయింది. రెండు చాట్జీపీటీలు చాలా వరకు నాన్చుతూ అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీటిని విన్న యూజర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏం సమాచారం అడుగుతున్నారు. ఏం సమాధానం ఇస్తున్నారనేది తెలియక తికమకపడుతున్నారు. ఇలాంటి ప్రయోగం మాత్రం ఎప్పుడూ చేయకూడదని అనుకుంటున్నారు. Chatgpt talking with chatgpt Age of Ultron is near pic.twitter.com/zn0FZpra7h — Shiva Rapolu (@shivarapolu01) March 17, 2024 -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్ఫోన్లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్ను మరింత స్లిమ్గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్ను గ్లాస్ / మెటల్తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
మొబైల్ వాడుతున్నామంటే దాదాపు ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వాడుతుంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ పూర్తిగా యాప్ల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్, బ్యాంకింగ్ ఇలా ఏ అవసరానికైనా యాప్లు వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్నైనా ఉపయోగించాలి. ఇందుకు పూర్తి భిన్నంగా తాజాగా డచ్ టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ మొబైల్ను ఎలాంటి యాప్లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో తమ టీ-ఫోన్ డివైజ్లోని ఈ కాన్సెప్ట్ను కంపెనీ వివరించింది. వినియోగదారులు వాయిస్ రూపంలో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను రూపొందించారు. నావిగేషన్, క్యాబ్, హోటల్ బుకింగ్.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్వాల్కామ్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్లైన్ ఫంక్షనాలిటీని జత చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? రానున్న రోజుల్లో మొబ్స్ళ్లలో ఎవరూ యాప్లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డచ్ టెలికాం కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో భాగమవుతాయని వివరించారు. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్ఫోన్లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం వంటివి రియల్టైమ్లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్
దేశంలో భారీస్థాయిలో మొబైల్ ఫోన్ల తయారీని నెలకొల్పడంలో ఎన్నో విజయాలు సాధించినట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఆ క్రమంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ తయారీరంగంలో దూసుకుపోతుందన్నారు. ఫోన్పే ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఇండస్ యాప్ స్టోర్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే రెండు లేదా మూడు సెమీకండక్టర్ ప్లాంట్లకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. ‘మొబైల్ ఫోన్ల తయారీతో పరిశ్రమలో విశ్వాసం నెలకొంది. ఈ ఎకోసిస్టమ్లో భాగస్వాములు భారత్పై మొగ్గుచూపేలా కృషిచేసేలా చర్యలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లూ ఇదే ప్రయాణం కొనసాగుతుంది’అని చెప్పారు. దేశంలో సెమీకండ్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి వచ్చే 20 ఏళ్ల కాలానికిగాను ప్రధాని మోదీ స్పష్టమైన కార్యాచరణ సూచించారని చెప్పారు. -
ట్రక్కునే మొబైల్ హౌస్గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. అసలు కారణం అదే..
మొబైల్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటే ఆన్లైన్ మోసాలు అదే స్థాయిలో హెచ్చవుతున్నాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని జోషి సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తూ, మోసాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని చెప్పారు. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలలో ఈ సమావేశంలో చర్చించారు. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ఈ సమావేశంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ వివరించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో డిజిటల్ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్కార్డ్లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్ప్రైజ్ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్స్టామార్ట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్కు ఎందుకు ద్వేషం? -
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్వర్క్ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో!
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. కొందరు కారును హెలికాప్టర్గా మారుస్తారు. మరికొందరు ఇటుకలతో కూలర్ను తయారు చేసేస్తారు. తాజాగా వీటన్నింటికి మించిన ఒక వీడియో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లాడి తెలివిని చూసి, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి పిల్లలు మొబైల్ ఫోను చూడటంతో ఎంత బిజీ అయిపోయారంటే వారు ఒక్క నిమిషం కూడా ఫోనును విడిచిపెట్టడం లేదు. ఒక కుర్రాడు ఒకవైపు చదువుకుంటున్నట్లు నటిస్తూ, దొంగచాటుగా మొబైల్ ఫోన్ ఎలా చూస్తున్నాడో ఈ వీడియోలో కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లవాడు టేబుల్పై కూర్చుని చదువుకోవడంతో పాటు అతని ముందున్న గోడకు ఆనుకుని, తీగతో మొబైల్ వేలాడదీయడాన్ని మనం గమనించవచ్చు. పిల్లాడు మొబైల్ చూడటంతో మునిగివుండగా, అప్పుడే తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించింది ఆ కుర్రాడి తల్లి. ఇలా తల్లి తలుపు తెరవగానే.. గోడకు వేలాడుతున్న మొబైల్ వెంటనే టవల్ వెనుకకు చేరుకుంది. ఆ తల్లి గది నుండి బయటకు వెళ్లగానే మొబైల్ఫోన్ మళ్లీ ఆ పిల్లాడి ముందు కనిపిస్తుంది. ఆ కుర్రాడు మొబైల్ ఫోనును తన తల్లికి తెలియకుండా దాచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాడో వీడియోలో స్పష్టగా కనిపిస్తుంది. ఈ వీడియో @TheFigen_ పేరుతో X (ట్విట్టర్)లో షేర్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ పిల్లవాడిని స్మార్ట్ బాయ్ అని పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: ‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు! Smart boy 😂pic.twitter.com/lXKoy7ZVK6 — Figen (@TheFigen_) August 24, 2023 -
Chandrababu : జలీల్ఖాన్కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్ఖాన్కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి
జైపూర్: ప్రజలకు సేవలందిస్తూ మంచిపేరుతో పాటు వార్తల్లో నిలుస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే మరికొందరు మాత్రం లంచాలు, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఉద్యోగి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి నగరంలో మొబైల్లను ఇచ్చేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. సునీల్ కుమార్ జన్గిడ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్ ప్రాంతానికి చెందిన బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అతని తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, తండ్రి జైపూర్ వెళ్ళాడు. ఈ విషయం సునీల్కు తెలియడంతో బాలిక ఇంటికి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఇస్తోందని చెప్పి తనతో పాటు రావాలని చెప్పి.. ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఈద్గా మార్గంలో వదిలేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని వ్యతిరేకించినందుకు క్యాషియర్ తనను కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి! -
మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్తో ప్రేమజంటకు రెక్కలు..
సీమా-హైదర్ల పబ్జీ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇదేకోవలో ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్ గేమ్ అడుతూ బీహార్కు చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పరుచుకుంది. మాటలు, ముచ్చట్ల అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. అంతే.. వీరిద్దరూ ఇళ్ల నుంచి మాయమయ్యారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేటి యువతీయువకులకు తమ ప్రేమికులను ఎంచుకునేందుకు సరికొత్త మార్గం తెరుచుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు ఏర్పరుచుకుని, వాటిని ప్రేమలుగా మార్చుకుంటున్నారు. వీటికితోడు కొత్తగా ఆన్లైన్ గేమ్లు కూడా యువతీయువకుల ప్రేమలకు వేదికలవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్, భారత్కు చెందిన సచిన్ల లవ్ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. ఇదే నేపధ్యంలో ఇప్పుడు గోరఖ్పూర్లోనూ ఇటువంటి ప్రేమకథ వెలుగుచూసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గోరఖ్పూర్లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 ఏళ్ల యువతి ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రెండు రోజుల పాటు గాలించారు. ఈ నేపధ్యంలో తమ కుమార్తె ప్రియునితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వారు పీపీగంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆ యువతి కోసం వెదుకులాట మొదలుపెట్టారు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ల ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమయ్యింది. దీంతో సీమా తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ గుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, చివరకు నోయిడాలోని తన ప్రేమికుని వద్దకు చేరింది. ఇదేవిధంగా గోరఖ్పూర్కు చెందిన ఒక యువతి బీహార్కు చెందిన ఒక యువకునితో ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. దీంతో పట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు చేరుకుంది. ఫ్రీ ఫైర్గేమ్ ప్రేమికులిద్దరూ జూలై 31న ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్లో గేమ్ ఆడుతుంటుందని తెలిపారు. తాము కుమార్తెపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. ప్రియుడు ఆటోవాలా.. ఈ ఉదంతం గురించి పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ మాట్లాడుతూ మాయమైన యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రేమికుల గురించి వెదుకులాట ప్రారంభించామన్నారు. వీరి లొకేషన్ బీహార్లోని పట్నాను చూపిస్తున్నదన్నారు. ఆ యువకుడు పట్నాలో ఆటో నడుపుతుంటాడన్నారు. ప్రేమికులిద్దరినీ గోరఖ్పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రం పరిధిలో ఉన్నందున్న అనుమతులు అవసరమవుతాయన్నారు. ఆ యువతి మైనర్ అని, ఆమెకు 21 ఏళ్ల అని, ఆ ప్రేమికులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇది కూడా చదవండి: నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
మొబైల్ ఘుమఘుమలు
ఇప్పుడు ప్రతి విషయాన్ని కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బుకు అత్యంత విలువ ఇస్తున్నారు. అంతేకాదు.. నాణ్యమైన భోజనంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇరుకు సందుల్లో, జనం గుమికూడిన ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. నగర శివారులోకి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరలోనే లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడన.. అప్పటికప్పుడు తయారు చేస్తున్న అల్పాహారం తినేందుకు ఇష్టపడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ డబ్బుంటే పెద్ద హోటళ్లకు వెళ్లి తింటారనుకోవడం పొరపాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంచి హోటల్ ఎక్కడుందని వెతుక్కోవడం మాని శివారు ప్రాంతాల్లో మొబైల్ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారు. ఉదయాన్నే గుత్తి పెట్రోల్ బంకు, నంద్యాల చెక్పోస్టు, రింగ్రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మొబైల్ క్యాంటీన్ల చుట్టూ గుమికూడిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తాయి. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్లు నగరంలోకి వెళ్లే ముందే టిఫిన్ కానిచ్చేస్తే ఆ తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అక్కడే ఆగిపోతున్నారు. ఏదైనా పని మీద వచ్చినా, లేదా కుటుంబంతో వచ్చినా సుమారు ఐదారుగురు వెంట ఉంటుండటంతో మొబైల్ క్యాంటీన్ ఎంచక్కా వీరి ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఏ హోటల్కు వెళ్లినా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం టిఫిన్ చేయాలంటే సుమారు రూ.500 పైమాటే అవుతుంది. ఇక కూర్చొని తినే హోటళ్లు అయితే.. ఆర్డర్ ఇచ్చిన ఏ అరగంటకో కానీ టిఫిన్ టేబుల్ మీదకు రాని పరిస్థితి. చివరగా టిప్ ఇవ్వకపోతే వెయిటర్ అదో రకంగా చూడటం షరామామూలే. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద టిఫిన్ చేస్తే అప్పటికప్పుడు రుచికరమైన అల్పాహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అందునా ఏ టిఫిన్ చేసినా రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్ల వద్ద రద్దీ కూడా అధికంగానే ఉంటోంది. రోజుకు రూ.5లక్షల పైనే వ్యాపారం నగరంలోని ప్రధాన కూడళ్లలో దుకాణం అద్దెకు తీసుకోవాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. డిపాజిట్ లక్షల్లో చెల్లించడం సరేసరి. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు సరికొత్త ఆలోచనతో రోడ్డెక్కుతున్నాయి. కావాల్సిన విధంగా మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒక కూడలిలో వ్యాపారం జరగకపోతే కొంతకాలానికి మరోచోటుకు మార్చుకునే అవకాశం ఉండటం కూడా మొబైల్ క్యాంటీన్లపై ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలో వీటి సంఖ్య 80కి పైగానే ఉండటం విశేషం. ప్రతిరోజూ వీరి వ్యాపారం రూ.5లక్షలకు పైగానే ఉంటోందంటే భోజన ప్రియులను ఏస్థాయిలో ఆకట్టుకుంటున్నారో అర్థమవుతుంది. వంట మాస్టర్లకు గిరాకీ హోటల్ వ్యాపారంలో వంట మాస్టర్లు కీలకం. వీళ్లు ఒక్కరోజు సెలవు పెట్టినా యజమాని ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అందువల్లే మరొకరిని కూడా అందుబాటులో ఉంచుకుంటారు. అయితే మొబైల్ క్యాంటీన్లను ఉదయం మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఆ మేరకు కూలీ ఇస్తున్నారు. చేస్తున్న టిఫిన్ల ఆధారంగా కూడా కూలీ నిర్ణయిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మొబైల్ క్యాంటీన్లు సాయంత్రం కూడా నిర్వహిస్తుండటంతో మాస్టర్లు నెల వారీ జీతం తీసుకుంటున్నారు. వ్యాపారానికి అనువుగా వాహనాలు మొబైల్ క్యాంటీన్ నిర్వాహకులు తమ స్థోమతకు అనువుగా వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉంటుంది. వీటిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సెకండ్ హ్యాండ్ వాహనాలను రూ.3లక్షల్లోపు కొనుగోలు చేసి మొబైల్ క్యాంటీన్గా అదనపు డబ్బుతో తీర్చిద్దుకుంటున్నారు. ఇతని పేరు ఆంజనేయులు. చిన్న తనంలోనే పారుమంచాల గ్రామం నుంచి కర్నూలు నగరంలో స్థిరపడ్డారు. చెక్పోస్టు వద్ద ఒకటి, జి.పుల్లారెడ్డి కళాశాల సమీపంలో మరో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వీటితో ఇతను ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది కూలీలను ఏర్పాటు చేసుకొని వారికీ ఉపాధి కలి్పస్తున్నారు. ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతను హుస్సేన్రెడ్డి. దూరదర్శన్ కేంద్రం సమీపంలో వెంకటసాయి మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఒక వంట మాస్టర్, మరో ముగ్గురు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లే వాళ్లు ఇక్కడే ఆగి టిఫిన్లు చేసి వెళ్తున్నారని చెబుతున్నాడు. ఈ కారణంగా వాళ్లకు తక్కువ ధరలో టిఫిన్ లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నాడు. తక్కువ ధరలో అల్పాహారం నగరంలోని హోటళ్లతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో టిఫిన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల కింద ఆహ్లాదకరంగా తినే వీలుంటుంది. కళ్లెదుటే చేస్తుండటంతో నాణ్యత విషయంలోనూ అనుమానం అక్కర్లేదు. రుచికరమైన అల్పాహారం చాలా తక్కువ ధరతో అందిస్తున్నారు. – వెంకటేశ్వర్లు, మెడికల్ రెప్, కర్నూలు కళ్లెదుటే వేడివేడిగా.. మేము కర్నూలులో ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలో కాస్త పని చూసుకోవాలి. నగరంలోని హోటళ్లకు వెళితే అక్కడ ఆర్డరు చెప్పడం, తీసుకొచ్చే లోపు చాలా సమయం పడుతుంది. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద కళ్లెదుటే వేడివేడి టిఫిన్లు హాయిగా తినొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. – హుస్సేన్వలి, నంద్యాల చాలా రుచిగా ఉంటాయి నేను హమాలీ పని చేస్తుంటా. ఉదయాన్నే పని మీద బయటకు వస్తాం. హోటళ్లలో టిఫిన్ చేయాలంటే మాకు వచ్చే కూలీ సరిపోదు. అందుకే మొబైల్ క్యాంటీన్లలో తింటాం. ఇక్కడ ఎంతో రుచికరంగా, పరిశుభ్రత పాటించి వివిధ రకాల టిఫిన్లను అప్పటికప్పుడు అందిస్తారు. ధరలు కూడా చాలా తక్కువ. – రాజశేఖర్, దూపాడు, కర్నూలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement