చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోవిడ్ : ఫ్రాన్స్లో చైనా పర్యాటకుని మృతి
Published on Sat, 02/15/2020 - 17:06
పారిస్ : ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధితో ఫ్రాన్స్లో ఒక వృద్ధుడు మరణించాడు. 80 ఏళ్ల చైనా పర్యాటకుడు ఫ్రాన్స్లో మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఆగ్నెస్ బుజిన్ శనివారం ప్రకటించారు. గత మూడు వారాలుగా ఉత్తర పారిస్లోని బిచాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్లు తెలిపారు. 11 ధృవీకరించబడిన కరోనా వైరస్ కేసులలో ఒకరు చనిపోయారని ఆయన తెలిపారు. దీంతో యూరప్లో తొలి కరోనావైరస్ మరణంగా ఇది నిలిచింది. కాగా చైనాలో వుహాన్లో గత ఏడాది చివరలో గుర్తించిన కరోనావైరస్ అంతకంతకూ విస్తరించి ఆందోళన రేపింది. ఈవ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1500 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 66,000 కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
#
Tags