ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా..!

Published on Fri, 01/05/2018 - 23:35

న్యూయార్క్‌: ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్ర పోయేవారికి మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయట. తాజాగా అమెరికాలో జరిగిన అధ్యయనం ఇది తేల్చింది. నిద్రపోయే సమయంలో తేడాలు రావడం వల్ల ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయని బింగమ్‌టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం కొందరి నిద్రశైలిని గమనించారు. తక్కువగా నిద్రపోయిన వారికి వివిధ రకాల ఫొటోలు చూపించి, వారి భావోద్వేగాలను పరిశీలించారు. చాలా మందికి ప్రతికూల స్పందనలు వచ్చినట్టు గుర్తించారు. వీళ్లు ప్రతికూల ఆలోచనల నుంచి దృష్టిని మళ్లించుకోవడానికి కూడా ఇబ్బందిపడినట్టు వెల్లడయింది. సాధారణ నిద్ర ఉన్న వారికి ప్రతికూల భావనలు కలిగే ఫొటోలు చూపించినా కాసేపటికి తమ దృష్టిని మళ్లించగలిగారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ